త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో.గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దర్శలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా నుంచి మొదటి పాటగా వచ్చిన సామజవరగమన ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
దీంతో ఫోక్ బీట్ తో సాగే రాములో రాములా సాంగ్ కూడా ఆడియన్స్ ని భాగా ఇంప్రెస్ చేసింది.ఈ రెండు సాంగ్స్ హిట్ తో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇక ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ కూడా ఆకట్టుకుంది.మరో సారి త్రివిక్రమ్ ఫ్యామిలీ టచ్ ఇచ్చే సినిమాని ప్రేక్షకులకి అందిస్తున్నాడని అర్ధమైంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో పాట యుట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని యువ గాయకుడు అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించారు.
సంగీత దర్శకుడు తమన్ తనదైన శైలిలో మెలోడీ బీట్స్ తో ఆకట్టుకున్నాడు.బుట్ట బొమ్మా.బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూ కుంటివే అంటూ సాగే ఈ పాట లెరికల్ సాంగ్ మరో సారి సోషల్ మీడియాలో దూసుకుపోతూ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది.