స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బన్నీ అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకున్నారు.
ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.అయితే ఈ సినిమా ఇప్పుడు మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ను జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమాను టీవీలో వరల్డ్ ప్రీమియర్గా ఆగష్టు 15న సాయంత్రం 6.30 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు.దీంతో ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బన్నీ స్టైలిష్ యాక్టింగ్కు త్రివిక్రమ్ టేకింగ్ తోడవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది.ఇప్పుడు బుల్లితెరపై కూడా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ను అందుకోవాలని ఈ సినిమా రెడీగా ఉంది.
మొత్తానికి వెండితెరను దుమ్ములేపిన అల వైకుంఠపురములో చిత్రం, ఇప్పుడు బుల్లితెరపై సరికొత్త రికార్డును క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది.ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.
యూట్యూబ్లో పలు స్టన్నింగ్ రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ టాప్ సాంగ్స్ లిస్టులో నిలిచాయి.ఇక బన్నీ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.