స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో అన్ని పనులు ముగించుకుని సంక్రాంతి బరిలో రిలీజ్కు రెడీ అయ్యింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో బన్నీ మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని ఆయన ఫ్యాన్స్తో పాటు చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.
అయితే సంక్రాంతి బరిలో బన్నీతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఉండటంతో ఈ సినిమా ఎలా తట్టుకోగలదో అనే సందేహం అందరిలోనూ ఉంది.కానీ ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే ఈ సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఏర్పడిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
త్రివిక్రమ్, బన్నీల కాంబో కావడంతో ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు బయ్యర్లు ఈ సినిమా హక్కులను అదిరిపోయే రేటుకు సొంతం చేసుకున్నారు.ఈ సినిమా ప్రపంచ్యవాప్తంగా రూ.84.46 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.ఈ రేంజ్లో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం బన్నీ కెరీర్లోనే మొదటిసారి అని ఈ సినిమా లెక్కలు చూస్తే చెప్పొచ్చు.పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించారు.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రీరిలీజ్ బిజినెస్ విరవాలు ఈ విధంగా ఉన్నాయి
నైజాం – 20.00 కోట్లు
సీడెడ్ – 12.06 కోట్లు
నెల్లూరు – 2.80 కోట్లు
కృష్ణా – 5.00 కోట్లు
గుంటూరు – 6.30 కోట్లు
వైజాగ్ – 8.50 కోట్లు
ఈస్ట్ – 6.30 కోట్లు
వెస్ట్ – 5.00 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 65.96 కోట్లు
కర్ణాటక – 7.20 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.50 కోట్లు
ఓవర్సీస్ – 9.80 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ – 84.46 కోట్లు
.