ప్రస్తుతం టాలీవుడ్లో రెండు పెద్ద సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి.సంక్రాంతి పండగ సందర్భంగా రంగంలోకి దిగుతున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు పోటాపోటీగా తెరకెక్కుతున్నాయి.
ఈ సినిమాల్లో ఏ సినిమా బ్లాక్బస్టర్గా నిలుస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.
జనవరి 5వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.అయితే తాజాగా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ను అనౌన్స్ చేశారు.
ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ను కూడా హైదరాబాద్లోనే జనవరి 6న భారీ ఎత్తున జరగనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ ఈవెంట్ ఎక్కడ జరగనుందనే విషయాన్ని వారు ఇంకా రివీల్ చేయలేదు.
ఏదేమైనా మహేష్-బన్నీలు తమ చిత్రాల ప్రీరిలీజ్ ఈవెంట్లను కేవలం ఒక్కరోజు తేడాతో నిర్వహిస్తుండటంతో ఇండస్ట్రీలో పోటీ నెలకొందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.సినిమాల రిలీజ్కు ముందే ఈ తరహా పోటీ ఉంటే, సినిమాలు రిలీజ్ అయ్యాక ఈ పోటీ ఎలా ఉంటుందా అని వారు గుసగుసలాడుతున్నారు.మొత్తానికి ఈ సంక్రాంతి పండగకు ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ మాత్రం పెద్ద ఎత్తున ఉండటం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్.