స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం అల వైకుంఠపురములో ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.
ఈ సినిమాలో బన్నీ స్టైల్తో అదరగొట్టగా త్రివిక్రమ్ తనదైన మార్క్తో అదరగొట్టాడు.
కాగా ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతే బ్లాక్బస్టర్గా దూసుకుపోతున్నాయి.
ఈ సినిమాకు పోటీగా ఒక్కరోజు ముందే వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాను ఓవర్టేక్ చేసి మరీ ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది.ఇప్పటికే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండగా, నైజాం ప్రాంతంలో ఈ సినిమా కలెక్షన్లతో హడలెత్తిస్తోంది.ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా ఆదివారం నాటికి ఒక్క నైజాం ఏరియాలో రూ.40 కోట్ల మార్కును దాటి తన సత్తా చాటిందని తెలుస్తోంది.
ఇంత భారీ కలెక్షన్లను నైజాం ఏరియాలో సాధించిన అతితక్కువ సినిమాల్లో అల వైకుంఠపురములో చిత్రం నిలిచింది.ఈ సినిమా టోటల్ రన్లో ఎంత మొత్తం సాధిస్తుందనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్లో సాగుతోంది.
మరి త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అద్భుతంగా అందించిన విషయం తెలిసిందే.