స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కొన్ని ఏరియాలో అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేసి అవాక్కయ్యేలా చేసింది.
కాగా తాజాగా ఈ చిత్రం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది.ఇక్కడ ఉన్న సంధ్య 35ఎంఎం థియేటర్లో అల వైకుంఠపురములో చిత్రం 30 రోజులు ముగిసే సరికి రూ.1 కోటి గ్రాస్ కలెక్షన్లు సాధించేందుకు రెడీ అవుతోంది.సోమవారం నాటికి ఈ చిత్రం ఇక్కడ రూ.99,46,474 వసూళ్లు సాధించింది.కాగా మంగళవారం రూ.1 కోటి మార్క్ను దాటడం ఖాయమంటున్నారు చిత్ర విశ్లేషకులు.
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, ఖుషీ చిత్రాలు ఈ ఫీట్ను సాధించాయి.మళ్లీ ఇన్నాళ్లకు అల వైకుంఠపురములో చిత్రం ఈ ఫీట్ను సాధించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగా, పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.థమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.