అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా విడుదల అయ్యి మంచి టాక్తో నడుస్తోంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న ఈ చిత్రం మొదటి ఆరు రోజుల్లోనే ఏకంగా వంద కోట్ల షేర్ను రాబట్టినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
కేవలం 6 రోజుల్లో వంద కోట్ల షేర్ అంటే ప్రస్తుతం ట్రేడ్ వర్గాల వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు ఒక తెలుగు సినిమా అది కూడా కేవలం తెలుగు రాష్ట్రాల మార్కెట్ మరియు ఓవర్సీస్లో వంద కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు అంటున్నారు.
వారు చెబుతున్న లెక్కల వివరాలు చూస్తుంటే నమ్మబుద్ది అవ్వడం లేదని, కాని సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కారణంగా వసూళ్లు సాధించి ఉంటాయా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తునన్నారు.కాని ట్రేడ్ ప్రముఖుల మాట ప్రకారం అసలు అలాంటి ఛాన్స్ లేదని, ప్రస్తుతం మార్కెట్ ఉన్న పరిస్థితిని బట్టి 60 నుండి 70 కోట్ల వరకు అంటే పర్వాలేదు కాని మరీ పాతిక కోట్లను మార్చి చెబుతున్నారేమో అనిపిస్తుంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి అల వైకుంఠపురంలో సినిమా విషయంలో ఆ సినిమా కలెక్షన్స్ విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.