అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టి పోయింది కదా మళ్లీ నాలుగు రోజుల్లో రావడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.అసలు విషయం ఏంటీ అంటే ఈమద్య కాలంలో థియేటర్లలో వచ్చిన సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్పై వస్తుందా అంటూ నెటిజన్స్ ఎదురు చూస్తున్నారు.
నెల వ్యవదిలోనే ఓటీటీపై వచ్చేస్తుంది.అలా చేయడం వల్ల నిర్మాతలకు నష్టం కలుగుతుందనే ఉద్దేశ్యంతో 50 రోజులకు విడుదల చేస్తున్నారు.
అల వైకుంఠపురంలో చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది.కనుక సన్ నెక్ట్స్ లో ఈ సినిమాను స్ట్రీమ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.నాలుగు రోజుల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.ఆ తర్వాత ఆహాలో కూడా ఇది స్ట్రీమ్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.పెద్ద ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.అంచనాలను అందుకుని సంక్రాంతి విజేతగా ఈ చిత్రం నిలిచింది అనడంలో సందేహం లేదు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్కు జోడీగా బుట్టబొమ్మ అంటూ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.ఇక ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్గా నిలిచి సినిమా ఇంతటి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.రికార్డు స్థాయి వసూళ్లు సాధించడంతో సినిమాను ఇంకా కూడా చూడని వారు ఓటీటీపై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
—
.