గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అల వైకుంఠ పురంలో.త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పాటలు ఏ స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బన్నీ పూజా హెగ్డేలు డాన్స్ తో అదరగొట్టడంతో పాటు థమన్ ఇచ్చిన సంగీతం ప్రతి పాటకు ప్రాణం పోసింది అనడంలో సందేహం లేదు.అందుకే సినిమాలోని ప్రతి పాట కూడా బ్లాక్ బస్టర్.
ఇక బుట్టబొమ్మ పాట అయితే అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది.ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా పాటలకు దక్కని అద్బుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది.
బుట్ట బొమ్మ పాట ఏకంగా 500 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది.
గత ఏడాది వందల మిలియన్ లను దక్కించుకున్న బుట్ట బొమ్మ పాట ఈ ఏడాదిలో కొత్త రికార్డును నమోదు చేసింది.ఈ రికార్డుల వేట కొత్త సంవత్సరంలో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.500 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసి తమ అభిమానులతో సంతోషంను షేర్ చేసుకున్నారు.అందుకు సంబంధించిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తుంది.గత ఏడాది సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకుంది.వసూళ్ల విషయంలోనే కాకుండా సినిమా ఆల్ టైం రికార్డును కూడా సొంతం చేసుకుంది.
సినిమా వచ్చి ఏడాది అయినా కూడా ఇప్పటి వరకు సినిమా జోరు కంటిన్యూ అవుతూనే ఉంది.ఇప్పటికే థమన్ పలు సినిమాలను తీసుకు వచ్చాడు.
కాని బుట్ట బొమ్మ పాట మాత్రమే ట్రెండ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.