సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లో విజేత ఎవరు అంటే తడుముకోకుండా అల వైకుంఠపురంలో చిత్రం అంటూ అంతా చెప్పేస్తున్నారు.సరిలేరు నీకెవ్వరు చిత్రం వంద కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నా కూడా ఆ వార్తలను కొందరు నమ్మడం లేదు.
కాని అల వైకుంఠపురంలో చిత్రం మాత్రం భారీ వసూళ్లు నమోదు చేసిన విషయాన్ని అంతా కూడా నమ్ముతున్నారు.ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది, ఖచ్చితంగా ప్రేక్షకులు సినిమాకు అంతగా వసూళ్లు కట్టబెట్టి ఉంటారు అనుకుంటున్నారు.
అల వైకుంఠపురంలో చిత్రం పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న విషయం తెల్సిందే.రంగస్థలం పేరుతో ఉన్న ఓవర్సీస్ నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టడం జరిగింది.ఇక నైజాం ఏరియాలో మహేష్.పవన్, చరణ్ల రికార్డులను బన్నీ బీట్ చేశాడు.ఇలా అన్ని ఏరియాల్లో కూడా వసూళ్లు కుమ్మేస్తున్నాయి.విడుదలైన వారం లోపే సినిమాకు బ్రేక్ ఈవెన్ లభించిందట.
ఆపై వస్తున్నవన్నీ కూడా లాభాలే అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.
థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా 100 కోట్ల లాభాన్ని దక్కించుకుందట.ఇంకా మరో 10 నుండి 15 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు.ఇక శాటిలైట్ రైట్స్ మరియు ఓటీటీ రైట్స్ ద్వారా మరో 50 కోట్ల వరకు ఈ చిత్రంకు లాభం రావడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంటే ఈ చిత్రంతో నిర్మాతలు చినబాబు మరియు అల్లు అరవింద్లకు ఏకంగా 150 కోట్ల వరకు లాభాలు రాబోతున్నట్లుగా చెబుతున్నారు.