స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక అందరి అంచనాలను దాటేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల మార్కును దాటేసింది.ఇక తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది.సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు సినిమా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.ఇక 50 రోజులు ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.161.22 కోట్ల వసూళ్లు సాధించింది.
బన్నీ స్టైలిష్ యాక్టింగ్కు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ తోడవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.
ఇక ఈ సినిమా 50 రోజుల వసూళ్లు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 44.87 కోట్లు
సీడెడ్ – 18.50 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.84 కోట్లు
ఈస్ట్ – 11.44 కోట్లు
వెస్ట్ – 8.93 కోట్లు
గుంటూరు – 11.14 కోట్లు
కృష్ణా – 10.84 కోట్లు
నెల్లూరు – 4.71 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 131.02 కోట్లు
కర్ణాటక – 9.23 కోట్లు
కేరళ – 1.17 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.44 కోట్లు
ఓవర్సీస్ – 18.35 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ కలెక్షన్లు – 161.22 కోట్లు
.