అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా రేపు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.రికార్డు స్థాయిలో బిజినెస్ అయిన ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించబోతున్న చిత్రం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు టాలీవుడ్ టాప్ 5 చిత్రాల జాబితాలో ఈ చిత్రం నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా చాలా ధీమాగా ఉన్నారు.
బన్నీ కాన్ఫిడెన్స్ చూస్తున్నా కూడా ఆశ్చర్యంగా ఉంది.త్రివిక్రమ్తో బన్నీకి ఇది మూడవ సినిమా.
రెండు సినిమాలు హిట్, దీంతో హ్యాట్రిక్ ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించడంతో పాటు మురళి శర్మ మరియు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
అందుకే ఈ సినిమా నిండా కూడా భారీ తారాగణం కనిపించబోతుంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది.
అయితే త్రివిక్రమ్ గత చిత్రాలు అజ్ఞాతవాసి మరియు అరవింద సమేత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.అందుకే ఈ చిత్రం అయినా ఆకట్టుకుంటుందా అంటూ ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తర్వాత ఏకంగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు.2018 ఏప్రిల్లో ఆ సినిమా రాగా కాస్త అటు ఇటుగా రెండు ఏళ్లకు అల వైకుంఠపురంలో వస్తుంది.బన్నీ కెరీర్లో ఇంత గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదు.ఈ చిత్రంతో ఆ గ్యాప్ను పిల్ చేస్తాడా అనేది చూడాలి.సక్సెస్ అయితే గ్యాప్ గురించి ఎవరు పట్టించుకోరు.మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల వైకుంఠపురంలో సినిమా రివ్యూ మొదటగా మీకు అందిస్తాం.
తెలుగు స్టాప్ను ఫాలో అవుతూనే ఉండండి.