త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా అల వైకుంఠపురంలో.ఈ సినిమా ఊహించని విధంగా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకొని బన్నీ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచిపోయింది.
ఏకంగా 200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందనే టాక్ వినిపిస్తుంది.ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ మాయాజాలం వెరసి సింపుల్ స్టొరీగానే వచ్చిన ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరధం పట్టారు.
ఆహ్లాదకరంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులని కనెక్ట్ చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే సౌత్ నుంచి ముఖ్యంగా తెలుగు నుంచి చాలా సినిమాలు బాలీవుడ్ స్క్రీన్ పైకి వెళ్తున్నాయి.ఇప్పుడు ఇదే దారిలో అల వైకుంఠపురములోకి వెళ్ళబోతుంది.గతంలో అర్జున్ రెడ్డి చిత్రం రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత అశ్విన్ వార్దే ఈ చిత్రం రైట్సనూ సొంతం చేసుకున్నాడు.అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి భారీ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.
అదే దారలో అలతో మరో సారి బాలీవుడ్ లో హడావిడి చేయాలని భావిస్తున్నాడు.ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రెండ్ భాగా నడుస్తుంది.
ఈ నేపధ్యంలోనే అల వైకుంఠపురంలో కూడా అక్కడి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి రిమేకి కి రెడీ అయ్యారు.ఇక దీని కోసం ఎనిమిది కోట్లు చెల్లించి రీమేక్ రైట్స్ ని నిర్మాత అశ్విన్ సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా కోసం చాలా మంది పోటీ పడగా ఫైనల్ గా అశ్విన్ కి ఆ అవకాశం లభించిందని తెలుస్తుంది.