తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు చానల్లో అప్పట్లో ప్రసారమయ్యేటువంటి “పెళ్లినాటి ప్రమాణాలు” అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న నటుడు అకుల్ బాలాజీ ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటాడు.అంతేగాక అకుల్ బాలాజీ టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి తో కలిసి పలు రియాల్టీ షోలలో కూడా పనిచేశాడు.
అయితే తాజాగా అకుల్ కి సంబంధించినటువంటి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఇటీవల కాలంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ లాక్ డౌన్ నిబంధనలను పాటించకుండా అకుల్ బాలాజీ తన పెళ్ళికి బెంగళూరులోని ఓ గెస్ట్ హౌస్ లో ఏర్పాట్లు చేసుకుంటున్నాడనే సమాచారంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలపై అకుల్ బాలాజీ కుటుంబ సభ్యులు మాత్రం స్పందించడం లేదు.
అఖిల్ బాలాజీపై వస్తున్నటువంటి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అకుల్ బాలాజీ కన్నడలో పలురకాల టీవీ షోలలో మరియు సీరియళ్లలో నటిస్తున్నాడు.
ఈ మధ్యకాలంలోఅకుల్ బాలాజీ అప్పుడప్పుడు కన్నడ సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు.గతంలో కూడా అకుల్ బాలాజీ దాదాపుగా పది చిత్రాలకుపైగా నటించాడు.
కానీ హీరోగా సినిమా అవకాశాలు మాత్రం రాబట్టుకోలేకపోయాడు.