లారెన్స్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ బాషలలో కాంచన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాలో శరత్ కుమార్ చేసిన కాంచన క్యారెక్టర్ సినిమాకి హైలైట్ అయ్యింది.
హిజ్రా క్యారెక్టర్ లో శరత్ కుమార్ మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు.ఆ ఎమోషనల్ ఎలిమెంట్ కారణంగానే సినిమా సౌత్ లో సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమాని అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో లారెన్స్ రీమేక్ చేశాడు.దీనికి లక్ష్మి అనే టైటిల్ పెట్టారు.
అయితే ఏమైందో కాంచనకి మెయిన్ సోల్ లాంటి హిజ్రా కథని పూర్తిగా తగ్గించేసి కథనం మొత్తం అక్షయ్ కుమార్ చుట్టూ నడిపించాడు.దీంతో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
లాక్ డౌన్ సమయంలో హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ తెచ్చుకొని ఆ చానల్ కి భారీ లాస్ మిగిల్చింది.కథ మొత్తం ఏదో చుట్టేసినట్లు ఉందని టాక్ వచ్చింది.
అలాగే ఒరిజినల్ కథలో ఉండే ఎమోషన్, ఫీల్ మొత్తం లక్ష్మిలో లేదని ఈ కారణంగానే సినిమా డిజాస్టర్ అయ్యిందని విమర్శకులు సైతం తేల్చేశారు.
ఇదిలా ఉంటే ఒటీటీలో డిజాస్టర్ అయిన ఈ సినిమాకి టెలివిజన్ లో మాత్రం ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది.
టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ ని లక్ష్మి సినిమా సొంతం చేసుకోవడం విశేషం.ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్పై బ్లాక్బస్టర్ రేటింగ్ను నమోదు చేసిన అన్ని రికార్డులను లక్ష్మి సినిమా బద్దలు కొట్టేసింది.ఏకంగా 2.51 కోట్లకు పైగా వ్యూయర్ షిప్తో అతిపెద్ద ప్రీమియర్ రికార్డును కొట్టేసింది.మార్చి 21 న స్టార్ గోల్డ్లో ప్రసారం అయిన ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభించిందని చెప్పాలి.అత్యధిక ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ఇంప్రెషన్స్ సాధించిన మూవీగా లక్ష్మీ నిలవడంపై దర్శకుడు రాఘవ లారెన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.