బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా నటించిన సూర్యవంశీ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంటూ అధిక కలెక్షన్లను రాబడుతోంది.ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్‘ అనే చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.
ఈ చిత్రాన్ని ‘పృథ్వీరాజ్’ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు.ఇకపోతే ప్రస్తుతం ఈ టీజర్ విడుదల అయిన తరువాత సోషల్ మీడియా వేదికగా అక్షయ్ కుమార్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇలా నెటిజెన్స్ చేతిలో అక్షయ్ కుమార్ ట్రోలింగ్ అవ్వడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.పృథ్వీరాజ్’ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ పాత్రలో మానుషి చిల్లర్ నటిస్తోంది.ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఇందులో అక్షయ్ కుమార్ వయస్సు 54 సంవత్సరాలు కాగా హీరోయిన్ వయసు 24 సంవత్సరాలు కావడంతో నెటిజన్లు స్పందిస్తూ ఇదేందయ్యా ఇది ఇంత చిన్న వయసున్న అమ్మాయితో అక్షయ్ రొమాన్స్ చేయడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా వీరిద్దరి మధ్య పెద్ద మొత్తంలో వయసు తేడా ఉండటం వల్ల నెటిజన్లు స్పందిస్తూ ఇకపై మనం హీరోల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అని కొందరు కామెంట్లు చేయగా.మరికొందరు వాట్ ద హెల్ మ్యాన్, ఇది కొంచైమైనా భావ్యంగా ఉందా అని కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి నెటిజన్స్ చేతిలో అక్షయ్ దారుణంగా ట్రోల్ అవుతున్నారు.