బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వరుసగా బ్లాక్బస్టర్ సినిమాల్లో నటిస్తూ కోట్లు వెనకేస్తున్నాడు.అంతేగాక అక్షయ్ కుమార్ వివిధ యాడ్స్లోనూ నటిస్తూ సంపాదన రెట్టింపు చేసుకుంటున్నాడు.
అయితే తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ఓ యాడ్ వివాదాస్పదం కావడమే కాకుండా ఆయనపై కేసు కూడా నమోదయ్యేలా చేసింది.
నిర్మా వాషింగ్ పౌడర్ కంపెనీ యాడ్లో నటిస్తూ మరాఠా యోధుడి అవతారంలో కనిపించాడు.
దీంతో తమ మనోభావాలను దెబ్బతీసిన అక్షయ్ కుమార్పై మరాఠీలు కస్సుమంటున్నారు.ఇతర యోధుల బట్టలు మురిగ్గా ఉండటంతో అక్షయ్ కుమార్ వారి బట్టలను నిర్మా వాషింగ్ పౌడర్లో ఉతికి తెల్లగా చేస్తాడు.
అయితే మరాఠీల మనోభావాలను దెబ్బతీసే వింగా అక్షయ్ కుమార్ నటించాడని ఆయనపై మండిపడుతున్నారు మరాఠీలు.
మరాఠీల చరిత్ర తెలియని అక్షయ్ కుమార్ ఇలాంటి యాడ్లు మానుకోవాలని వారు సూచిస్తున్నారు.
అంతేగాక మరాఠీలు దేశరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేశారని, ముందు వారి గురించి తెలుసుకోవాలని అక్షయ్ కుమార్పై మండిపడుతున్నారు.ఈ వివాదంపై కొందరు ముంబై వర్లీ పోలీస్ స్టేషన్లో అక్షయ్ కుమార్పై కేసు నమోదు చేశారు.
మరి ఈ వివాదం ఎటు వెళుతుందో చూడాలి.