బాంబ్ వేయడానికి డేట్ ఫిక్స్ చేసిన స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీ బాంబ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

 Akshay Kumar Laxmmi Bomb Ott Release Date Fixed, Akshay Kumar, Laxmmi Bomb, Ott,-TeluguStop.com

కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోయారు చిత్ర యూనిట్.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన కాంచన చిత్రానికి రీమేక్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమాను ఓటీటీలో ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యాడు.

స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమాలో అక్షయ్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది.కాగా ఈ సినిమాతో రాఘవ లారెన్స్ బాలీవుడ్‌లోనూ తన పాగా వేయాలని చూస్తున్నాడు.

కాంచన సినిమా దక్షిణాదిన ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.మరి ఈ సినిమా బాలీవుడ్ జనాలను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube