తమిళ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా ఎలాంటి రిజల్ట్ను సాధించిందో అందరికీ తెలిసిందే.హార్రర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తి సక్సెస్ కావడంతో అప్పట్లోనే ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది.
కాగా ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్లో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు లారెన్స్.బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే ప్రస్తుతం పలు సినిమాలను ఓటీటీ ప్లాట్ఫాంలపై దర్శకనిర్మాతలు రిలీజ్ చేస్తుండటంతో, లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మొగ్గు చూపుతుంది.ఈ క్రమంలోనే లక్ష్మీ బాంబ్ చిత్రానికి ఓ ఓటీటీ వారు ఏకంగా రూ.125 కోట్ల భారీ ఆఫర్ను అందించారట.అయితే ఈ మొత్తానికి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట.
ఇక అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తు్న్న ఈ సినిమాను కాంచన రీమేక్గా తెరకెక్కిస్తున్న లారెన్స్, కథ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మరి లక్ష్మీ బాంబ్ చిత్రం ఓటీటీలో దర్శనమిస్తుందా లేదా అనేది చూడాలి.