బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లక్ష్మీ బాంబ్ ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ లాక్డౌన్ వారి ఆశలపై నీళ్లు జల్లింది.దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది.
అయితే ఈ సినిమా రిలీజ్ను అనౌన్స్ చేసి కూడా చాలా రోజులే అయ్యింది.ఇంకా ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.
దీంతో ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయామని చిత్ర యూనిట్ అంటోంది.
డిస్నీ హాట్స్టార్ ప్లాట్ఫాంపై ఈ సినిమాను దీపావళి కానుకగా స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమా ట్రైలర్ను అక్టోబర్లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
దక్షిణాదిలో వచ్చిన హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’కు రీమేక్గా ఈ సినిమా వస్తోంది.దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో బాలీవుడ్లోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నటన చిత్రాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.కాగా ఈ సినిమాలో ఆయన గెటప్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని వారు అంటున్నారు.
ఈ సినిమాలో అక్షయ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.మరి ‘కాంచన’ చిత్రంతో సౌత్లో అదిరిపోయే సక్సె్స్ అందుకున్న లారెన్స్, లక్ష్మీ బాంబ్తో దీపావళికి ఎలాంటి బాంబ్ పేలుస్తాడో చూడాలి.
ఏదేమైనా ఈ సినిమా ఓటీటీలో కూడా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో అక్షయ్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.