హిందీలో ఇటీవలే ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు రాఘవ లారెన్స్ లక్ష్మి బాంబ్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్ షా అక్షయ్ కుమార్, యంగ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు గత కొద్ది నెలలుగా మూత పడినప్పటికీ ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అయినటువంటి డిస్నీ+హాట్ స్టార్ లో విడుదల చేశారు.అయితే ప్రస్తుతం అక్షయ్ కుమార్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండటంతో ఓటీటి నిర్వాహకులు దాదాపుగా 150 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సినిమాని కొనుగోలు చేశారు.
కాగా ఈ నెల 9వ తారీఖున నుంచి హాట్ స్టార్ లో ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలై ఇప్పటికే ఐదు రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ఈ చిత్ర కొనుగోలుపై వెచ్చినటువంటి మొత్తంలో కేవలం 75 శాతం మాత్రమే వసూళ్లు వచ్చినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
దీనికితోడు ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించినటువంటి అక్షయ్ కుమార్ కి లేడీ గెటప్ సూటవ్వలేదని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు.
కానీ ఇప్పటివరకు హాట్ స్టార్ లో విడుదల చేసినటువంటి కొత్త చిత్రాలలో మొదటి రోజున లక్ష్మీ బాంబ్ చిత్రం అత్యధిక వసూళ్లను రాబట్టిందని హాట్ స్టార్ అధికారులు తెలిపారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో రణజిత్ ఎమ్ తివారి దర్శకత్వం వహిస్తున్న బెల్ బాటమ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సమాచారం. మరోవైపు ఆ మధ్య అక్షయ్ కుమార్ హీరోగా నటించినటువంటి “సూర్యవంశి” అనే చిత్రం కూడా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
కానీ ప్రస్తుతం సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాల విడుదల కొంతమేర ఆలస్యం కానుంది.
తాజా వార్తలు