బాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నటుడు అక్షయ్ కుమార్.ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని బీట్ చేసి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా అక్షయ్ కుమార్ తన హవా కొనసాగిస్తున్నాడు.
ఏడాదికి రెండు, మూడు సినిమాలు చాలా స్పీడ్ గా పూర్తి చేసేస్తూ దూసుకుపోతున్నాడు.అక్షయ్ కుమార్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కి డోకా ఉండదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కూడా ఉండటంతో ఆటోమేటిక్ గా అతని సినిమాలకి ఆడియన్స్ నుంచి స్పందన వస్తుంది.
అలాగే భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి.ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ, బెల్ బాటమ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్నాయి.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాల రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేద్దామని అనుకునే సమయానికి కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిర్మాతలు సైలెంట్ అయిపోయారు.అయితే గత ఏడాది అక్షయ్ నటించిన లక్మీు బాంబ్ మూవీ డైరెక్ట్ ఒటీటీలో రిలీజ్ అయ్యింది.
హాట్ స్టార్ ఏకంగా వందకోట్లు పెట్టి ఈ సినిమాని ఆప్పట్లో కొన్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో సూర్యవంశీ, బెల్ బాటమ్ సినిమాలు కూడా ఒటీటీలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయని, ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ నిర్మాతలతో కుదుర్చుకుందని ప్రచారం జరుగుతుంది.
దీనిపై తాజాగా అక్షయ్ కుమార్ స్పందించారు.నా సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు.
అయితే ఒటీటీ రిలీజ్ పై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ప్రస్తుతానికి రిలీజ్ విషయంపై నిర్మాతలు ఆలోచించలేదు.
త్వరలో దానికి సంబంధించి క్లారిటీ నేరుగా నిర్మాతల నుంచే వస్తుంది.అంత వరకు వెయిట్ చేయండి అని పోస్ట్ పెట్టాడు.