ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు ముంబైలో పలు ప్రాంతాలలో ఎన్నో భవంతులు కొనుగోలు చేసినప్పటికీ మరీ మరీ కొత్త భవంతులను కొనుగోలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ సైతం తాజాగా ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ టాక్.ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ ఖార్ వెస్ట్లోని జాయ్ లెజెండ్ భవనంలో 19వ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
1878చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం కోసం అక్షయ్ కుమార్ ఏకంగా 7.8 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ భవనం కోసం అక్షయ్ కుమార్ అధిక మొత్తంలోనే ఖర్చు చేసి తన సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో అక్షయ్ కుమార్ అంధేరీలో ఉన్న తన ఆఫీస్ను రూ.9 కోట్లకు అమ్మేసిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి జుహులోని డూప్లెక్స్ భవంతిలో నివాసముంటున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అక్షయ్ కేవలం ముంబైలో మాత్రమే కాకుండా గోవా, మారిషస్లోనూ వంటి ప్రాంతాలలో కూడా ఎంతో విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు బీ టౌన్ సమాచారం.ఇక అక్షయ్ కుమార్ ఒక సినిమాలో నటించడం కోసం సుమారు 100 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇక తాజాగా ఆయన నటిస్తున్న ‘సిండ్రెల్లా’చిత్రానికి ఏకంగా 35 కోట్ల పారితోషికం పెంచేసి 135 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.
ఇలా ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరో పలు ప్రాంతాలలో విలువైన వస్తువులను కొనుగోలు చేశారు.