నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలంటూ ఫైర్ అయిన స్టార్ హీరో...

ప్రస్తుత కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా రాసేటువంటి వార్తల కారణంగా సెలబ్రిటీలు తన అభిమానుల నుంచి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరగడంతో తనపై వస్తున్నటువంటి తప్పుడు వార్తలు గురించి అక్షయ్ కుమార్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు.

 Akshay Kumar, Bollywood Star Hero,fake News,  Bollywood-TeluguStop.com

ఇందులో భాగంగా ఇటీవలే ఓ వెబ్ సైట్ (తెలుగు స్టాప్.కామ్ కాదు) అక్షయ్ కుమార్ తన సోదరిని మరియు ఆమె పిల్లలని పని నిమిత్తమై వేరే ప్రాంతానికి పంపించడం కోసం ఏకంగా ఓ ప్రైవేటు విమానాన్ని బుక్ చేశారని ప్రచురించింది.

కానీ అక్షయ్ కుమార్ మాత్రం తన సోదరి లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఎక్కడికీ ప్రయాణాలు చేయలేదని స్పష్టం చేశాడు.అంతేగాక కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి అసత్య వార్తలను ప్రచురించడం ద్వారా సెలబ్రిటీలకు ఇబ్బందులు కలుగుతాయని కాబట్టి ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు ఒకసారి ఆలోచించాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మరో మారు నిజమేంటో  తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే కచ్చితంగా చట్ట పరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.దీంతో అక్షయ్ కుమార్ చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అక్షయ కుమార్ హీరోగా నటించినటువంటి “సూర్యవంశీ” అనే బాలీవుడ్ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.అలాగే  అక్షయ్ ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ దివేది దర్శకత్వం వహిస్తున్నటువంటి పృథ్వి రాజ్ అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube