ఎన్దిరన్ -2 ( రోబో – 2 ) షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది.సూపర్ స్టార్ రజినికాంత్ కొన్నేళ్ళ తరువాత మళ్ళీ చిట్టి గెటప్ లో కనిపించబోతున్నారు.250 కోట్ల బడ్జెట్, నాలుగైదు భాషల్లో రిలీజ్, మొత్తంగా భారతదేశంలో అత్యంత ఖరీదైన సినిమా.
250 కోట్లకు పైగా పెడుతున్నారంటే సినిమా బిజినెస్ ఎంత లేదన్నా మూడు వందల కోట్లు దాటొచ్చు.మరి అంత మొత్తం రికవర్ కావాలంటే దక్షిణాదిలో రజినికాంత్, శంకర్ పేర్లు చాలు.తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ జనాలు తండోపతండాలుగా వచ్చేస్తారు.మరి హిందిలో ఎలా? ఇదే అలోచనలో పడ్డారు మేకర్స్.
ప్రస్తుతం అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్న వార్త ఏమిటంటే బాలివుడ్ అగ్రహీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ ని విలన్ కోసం సంప్రదిస్తున్నారట.
మొదట ఆమీర్ ఖాన్ ని సంప్రదించగా ఆయన తిరస్కరించారు.తరువాత హాలివుడ్ హీరో అర్నాల్డ్ ని అనుకున్నా, రెమ్యునరేషన్ ఎక్కువ అడిగేసరికి జారుకున్నారు.
ఇక అక్షయ్ అయితే హిందీలో కూడా ప్రాజెక్టుకి క్రేజ్ వస్తుందని శంకర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇందులో ఎంతవరకు నిజం దాగుందో కాలమే చెప్పాలి.