అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో సౌత్ సూపర్ హిట్ మూవీ కాంచన లక్ష్మీ బాంబ్ పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.కథలో కొన్ని మార్పులు చేసి లారెన్స్ ఈ సినిమాని తెరకెక్కించారు.
ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో ఒటీటీలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.
డిస్నీ హాట్ స్టార్ ఏకంగా రెండు వందల కోట్లు వెచ్చించి ఈ సినిమాని కొనుగోలు చేసుకుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది.
అమీర్ ఖాన్ కూడా ఇందులో అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. హిజ్రా పాత్రలో నటించడం సాహసం అని కొనియాడారు.
బాలీవుడ్ ప్రముఖులు కూడా అక్షయ్ కుమార్ ని లక్ష్మి బాంబ్ విషయంలో పొగిడేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాని దీపావళి కానుగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి డిస్నీ హాట్ స్టార్ రెడీ అయ్యింది.
నవంబర్ 9న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా హీరో హీరోయిన్లు అక్షయ్ కుమార్ కియారా అద్వానీ ప్రమోషన్ ప్రారంభించారు.
ఇందులో భాగంగా వీళ్లు ట్రాన్స్ జెండర్స్ రైట్స్ కార్యకర్త లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కలుసుకున్నారు.వీరు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని హగ్ చేసుకొని దిగిన ఫోటో తో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అది కాస్తా వైరల్ అయ్యింది.మొత్తానికి హిజ్రాలని ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో సంఘంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలని కూడా తెరపై ఆవిష్కరించడం ద్వారా వారి మనసు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఏది ఏమైనా సౌత్ లో హిట్ బొమ్మ కాబట్టి బాలీవుడ్ లో కూడా అక్షయ్ ఇమేజ్ తో ఈ సినిమా దుమ్ములేపే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.