75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ఈనెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఎంతో ఘనంగా జరగనుంది.ఈ క్రమంలోనే ఈ ఫిలిమ్ ఫెస్టివల్ లో భాగంగా ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు ఈ వేదికపై సందడి చేయనున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలలో నటుడు అక్షయ్ కుమార్ ఒకరు.తాజాగా ఆయన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు దూరంగా ఉంటున్నారని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ప్రస్తుతం అక్షయ్ కుమార్ కరోనా బారిన పడటంతో కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు ఆయన దూరమవుతున్నట్లు వెల్లడించారు.
75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభం రోజు రెడ్ కార్పెట్ పై నడిచే సెలబ్రిటీలలో అక్షయ్ కుమార్ ఒకరు.అయితే ఈయన కరోనా బారిన పడటంతో ఈ కార్యక్రమానికి దూరం అవుతున్నానని,వాస్తవానికి 2022 కేన్స్ ఫెస్టివల్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను.కరోనా రావటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను అంటూ పేర్కొన్నారు.
మీ టీమ్ మొత్తానికి @ianuragthakur శుభాకాంక్షలు అంటూ ఈయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
అక్షయ్ కుమార్ కరోనా బారిన పడటం ఇది మొదటిసారి కాదు గత ఏడాది ఆయన ఒకసారి ఈయన కరోనా బారిన పడ్డారు.ఇలా రెండవ సారి అక్షయ్ కుమార్ కరోనా బారిన పడటంతో కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడవాల్సిన ఈయన ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.ఇక సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.