తెలుగులో ప్రముఖ దర్శకులు జి రవి చరణ్ రెడ్డి దర్శకత్వం వహించిన “కాళిదాసు” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన అక్కినేని సుశాంత్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే మొదట్లో అడపా దడపా సినిమాలతో సుశాంత్ బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగులు లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు.అంతేకాక సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉన్నాడు.
అయితే తాజాగా సుమంత్ తన స్టైలిష్ లుక్ ను అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.దీంతో సుశాంత్ అభిమానులు ఈ స్టైలిష్ లుక్ లో సూపర్ గా ఉన్నావని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతేగాక సుశాంత్ తన తదుపరి చిత్రం కోసం హెయిర్ స్టైల్ ని పూర్తిగా మార్చేశాడని చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుశాంత్ అక్కినేని టాలీవుడ్ నూతన దర్శకుడు దర్శన్ దర్శకత్వం వహిస్తున్న “ఇచట వాహనాలు నిలుపరాదు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో మంచి స్పందన వచ్చింది.కాగా ఆ మధ్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అల వైకుంఠపురములో” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.
.