ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆ సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యను సమంత వివాహం చేసుకున్నారు.
ఆ సినిమాలో సమంత పోషించిన జెస్సీ పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.ఏ మాయ చేశావె తరువాత సమంత, చైతన్య కాంబినేషన్ లో మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాలు వచ్చాయి.
సమంత, చైతన్య నటించిన సినిమాల్లో ఆటో నగర్ సూర్య మినహా మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.సమంత, చైతన్య పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు కాగా ఇప్పటికీ ఈ జంట కొత్త జంటలా కనిపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
తాజాగా సమంత సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది.ఏ మాయ చేశావె సినిమా సమయంలో చైతన్యతో దిగిన ఫోటోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చైతన్యతో కలిసి దిగిన ఆ ఫోటో ఎప్పటికీ గుర్తుండిపోయే ఫోటో అని సమంత తెలిపింది.సమంత షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.టాలీవుడ్ బెస్ట్ కపుల్ అయిన చైతన్య సమంత నెల రోజుల క్రితం మాల్దీవులకు వెళ్లగా అక్కడ చైతన్య పుట్టినరోజు వేడుకలను సమంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.పెళ్లి తరువాత సినిమాల్లో పద్ధతిగా కనిపిస్తున్న సమంత ఆఫ్ స్క్రీన్ లో గ్లామరస్ గానే కనిపిస్తున్నారు.
మరోవైపు సమంత ఆహా ఓటీటీలో సామ్ జామ్ షోను హోస్ట్ చేస్తున్నారు.సమంత హోస్ట్ చేస్తున్న షోకు మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే హాజరయ్యారు.చిరంజీవి హాజరైన ఎపిసోడ్ ఈరోజు నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుండగా అల్లు అర్జున్ హాజరైన ఎపిసోడ్ జనవరి 1వ తేదీ నుండి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
తాజా వార్తలు