అక్కినేని నాగేశ్వరరావు కెరియర్ ను నిలబెట్టిన వారిలో దుక్కిపాటి మధుసూదన్ రావు మరియు గూడవల్లి రామబ్రహ్మం లాంటివారు ముందు వరసలో ఉంటారు.దుక్కిపాటి వారినైతే అక్కినేని తన గురువుగా భావిస్తారు టాలీవుడ్ లో దిగ్గజ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు ఎదగడానికి ఈ దర్శక నిర్మాతలు ఏ కారణం కావడం విశేషం వీరి తర్వాత అదే స్థాయిలో అక్కినేని కి విజయాలను అందించిన వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ గారికి స్థానం దక్కుతుంది.
జగపతి ఆర్ట్ పిక్చర్స్ అనే బ్యానర్ను స్థాపించి రాజేంద్రప్రసాద్ నిర్మాతగా అక్కినేని వారితో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.
అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి అక్కినేని వారికి మంచి స్నేహం ఉండేది.
ఈ క్రమంలో అక్కినేని మరియు వాణిశ్రీ హీరో హీరోయిన్స్ గా దసరా బుల్లోడు చిత్రం తీయాలని రాజేద్రప్రసాద్ గారు తలపెట్టారు.కానీ ఆ సినిమా కోసం అనుకున్న దర్శకుడు వేరే సినిమాతో బిజీగా ఉండటం తో అక్కినేని నాగేశ్వరరావు రాజేంద్ర ప్రసాద్ నీ దర్శకత్వం వహించ మని కోరారు.
ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం చేయకపోతే తాను ఆ సినిమాలో నటించను అంటూ షరతు పెట్టారు.
అలా అక్కినేని బలవతం తో దసరా బుల్లోడు దర్శక నిర్మాత గా మారి పని చేయడం తో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.అలా వీరి బంధం కూడా ఎంతగానో బలపడింది.అయితే అక్కినేని మరియు రాజేంద్ర ప్రసాద్ మధ్య మాటల యుద్ధం జరిగిందట.
రాజేంద్ర ప్రసాద్ దసరా బుల్లోడు సినిమా టైంలో ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉండేవారట.ఆ విషయం కొంత మంది మిత్రులతో కూర్చున్న సమయం లో అక్కినేని అందరితో చెప్పారట.
ఈ విషయం ఆ నోట ఈ నోట రాజేంద్ర ప్రసాద్ వరకు చేరింది.మంచి మిత్రుడు అనుకున్న వ్యక్తి ఇలా చేయడం తో కోపం తో ఊగిపోయిన రాజేంద్ర ప్రసాద్ నేరుగా అక్కినేని దగ్గరికి వెళ్లి నిలదీసారట.నా విషయాలు అందరిలో చెప్పాల్సిన అవసరం ఏం వచ్చింది అంటే అక్కినేని కి మౌనమే సమాధానం అయ్యిందట.ఇక అక్కినేని రాజేంద్ర ప్రసాద్ మధ్య పెద్ద గొడవ జరిగిందట.
ఈ రాజేంద్ర ప్రసాద్ మరెవరో కాదు హీరో జగపతి బాబు కి స్వయానా తండ్రి.