ఏపీ రాజకీయాల్లో 2019 ఎన్నికలను బేస్ చేసుకుని చాలా మార్పులు జరగనున్నాయి.నిన్నటి వరకు అధికార టీడీపీ విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని దూసుకుపోయింది.
వరుసగా తమ పార్టీ ఎమ్మెల్యేలు అధికార టీడీపీలోకి జంప్లు చేస్తుండడంతో షాక్ల మీద షాక్లు తిన్న జగన్ ఇప్పుడు ఆపరేషన్ రికవరీ సక్సెస్ అవుతుండడంతో కాస్త జోష్లోకి వచ్చాడు.
ఆపరేషన్ రికవరీలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు వరుసపెట్టి జగన్ చెంతకు చేరుతున్నారు.2019లో గెలవకపోతే పొలిటికల్ ఫ్యూచర్ లేదని డిసైడ్ అయిన ఆ ఎన్నికల్లో గెలుపు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.ఈ క్రమంలోనే వైకాపాలోకి ఓ సూపర్ సెలబ్రిటీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ఏపీ పాలిటిక్స్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఆ సూపర్ సెలబ్రిటీ ఎవరో కాదు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున.
నాగ్కు-జగన్కు మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.గతంలో దివంగత మాజీ సీఎం రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాగ్ ప్రభుత్వ పథకాలకు సైతం ప్రచారం చేసి పెట్టారు.ఆ తర్వాత జగన్ జైలులో ఉన్నప్పుడు కూడా నాగార్జున వెళ్లి కలిసి వచ్చారు.
నాగార్జున వ్యాపారాలన్ని జగన్కు అత్యంత సన్నిహితులతోనే జాయింట్గా ఉన్నాయి.
ఇక ఇప్పుడు నాగార్జున రెండో కుమారుడు అఖిల్తో నాగ్-జగన్ మరింత దగ్గర బంధువులు కానున్నారట.
ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలిని అఖిల్ పెళ్లాడనున్న సంగతి తెలిసిందే.జీవీకే రెడ్డి-వైఎస్.
రాజశేఖర్రెడ్డి అత్యంత సన్నిహితులు, బంధువులు.ఇలా అఖిల్ ద్వారా నాగార్జున-జగన్ బంధువులు అవుతున్నారు.
ఈ క్రమంలోనే నాగార్జునను తన పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల బరిలో దింపాలని జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.నాగార్జునకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటులో ఆయన కోరుకున్న సీటు ఇచ్చే ఉద్దేశంలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.
నాగ్ పార్టీలో చేరితో బలమైన అక్కినేని అభిమానుల అండతో పాటు సినిమా గ్లామర్ కూడా తనకు కలిసొస్తుందని జగన్ భావిస్తున్నారు.మరి నాగ్ పొలిటికల్ ఎంట్రీ ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి.