టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున త్వరలోనే దుబాయ్ వెళ్తున్నారు.ఈయన దుబాయ్ వెళ్లడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ది ఘోస్ట్.
ఇప్పటికే ఈ సినిమా కొంత మేర షూటింగ్ పనులను జరుపుకుంది.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో నాగార్జున ఈ సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రంలో నటించారు.
ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో నాగార్జున తన తరువాతి చిత్రంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం చిత్రబృందం ఫిబ్రవరి 3వ తేదీ దుబాయ్ వెళ్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే నాగార్జునతో పాటు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సోనాల్ చౌహాన్ కూడా దుబాయ్ వెళ్తున్నారు.ఇక నాగార్జున ఇప్పటి వరకు నటించిన చిత్రాల కంటే ఈ సినిమాలో విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నారు.
గుబురు గడ్డం మెలి తిరిగిన మీసాలతో నాగార్జున ఇందులో ఒక రిటైర్డ్ రా ఏజెంట్ గా సందడి చేయబోతున్నారు.
ఇలా మూడవ తేదీ దుబాయ్ వెళ్తున్న చిత్రబృందం అక్కడ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నుంగ్ అండ్ టీమ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనునట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ముందుగా నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుందని,ఆమెపై ఒక వారం రోజులపాటు చిత్రీకరణ జరిగిన అనంతరం గర్భవతి అనే విషయం తెలియగానే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ఇక కాజల్ తర్వాత ఈ సినిమా కోసం అమలాపాల్ పేరు వినిపించినప్పటికీ చివరికి సోనాల్ చౌహాన్ ను ఫైనల్ చేశారు.
గరుడవేగ సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ది ఘోస్ట్ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.