నాగార్జున సినిమాల సంఖ్య వందకు చేరుకుంటున్నాయి.ఈయన 98వ సినిమా బంగార్రాజు రాబోతున్న విషయం తెల్సిందే.
ఇక 99వ సినిమాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఇక నాగార్జున వంద సినిమా చర్చలు మొదలు అయ్యాయి.
ఇప్పటికే దర్శకుడు మోహన రాజాకు వందవ సినిమా బాధ్యతలను అప్పగించినట్లుగా సమాచారం అందుతోంది.తమిళంలో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా సూపర్ హిట్స్ ను దక్కించుకున్న మోహన రాజా వచ్చే నెల నుండి మెగా స్టార్ చిరంజీవి తో లూసీఫర్ ను రీమేక్ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
పెద్ద ఎత్తున అంచనాలున్న నాగార్జున వందవ సినిమా లో అక్కినేని హీరోలు కూడా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఏయన్నార్ బతికి ఉన్న సమయంలో మనం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సినిమాలో మూడు తరాల అక్కినేని హీరోలు కనించారు.కాని నాగ్ 100వ సినిమాలో మాత్రం ముగ్గురు అక్కినేని హీరోలు కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
పెద్ద ఎత్తున అంచనాలున్న నాగ్ 100 వ సినిమా గురించి ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు మొదలు అయ్యాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జునతో పాటు అఖిల్ కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించబోతున్నాడు.
కాని నాగ చైతన్య మాత్రం గెస్ట్ రోల్ లోనే కనిపిస్తాడని అంటున్నారు.మొత్తానికి ఈ సినిమా మరింతగా సక్సెస్ అవ్వాలని మనం రేంజ్ లో మల్టీ స్టారర్ గా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు.
కనుక ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది.నాగార్జున వందవ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.తెలుగు లూసీఫర్ పూర్తి అయితే కాని నాగ్ వందవ సినిమా ను మోహన రాజా మొదలు పెట్టే అవకాశం లేదు.