అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా థ్యాంక్యూ.ఈ సినిమా చిత్రీకరణ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచి పోయింది.
సెకండ్ వేవ్ ప్రారంభం అయిన సమయంలో యూరప్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు.అక్కడ పరిస్థితులు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో వెంటనే ఇండియాకు తిరిగి వచ్చేశారు.
ఇండియాలో షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ అడ్డు వచ్చింది.దాంతో నాగచైతన్య సినిమా షూటింగ్ నిలిచి పోయింది.
మళ్లీ ఎప్పుడు ఈ సినిమా పునః ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు క్లీయర్ గా క్లారిటీ వచ్చేసింది.చిత్ర యూనిట్ సభ్యులు జూన్ 21 నుండి షూటింగ్ కు వెళ్లేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారట.
నాగచైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.లవ్ స్టోరీ మరియు థ్యాంక్యూ రెండు కూడా కేవలం రెండు నెలల గ్యాప్ లోనే విడుదల అయ్యేలా ఉన్నాయి.థ్యాంక్యూ సినిమా షూటింగ్ ను కేవలం రెండు మూడు వారాల్లోనే ముగించేలా షెడ్యూల్ ను ఖరారు చేశారు.జులైలో సినిమా ను ముగించి కొత్త ప్రాజెక్ట్ ను నాగచైతన్య మొదలు పెట్టబోతున్నాడు.
ఇక ఇటీవలే నితిన్ మ్యాస్ట్రో సినిమా పట్టాలెక్కింది.కనుక మెల్లగా ఇతర సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ పట్టాలెక్కబోతున్నాయి.
జులై నుండి సినిమా లు విడుదల కు అనుకూలంగా పరిస్థితి ఉంటుందని అంతా నమ్ముతున్నారు.కనుక షూటింగ్ లను ముగించి పెట్టుకుంటే ఏ సమయంలో అయినా విడుదల చేయవచ్చు కదా అని కొందరు అనుకుంటున్నారు.
నాగచైతన్య థ్యాంక్యూ సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకుంటాడనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.