కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచం గజగజ వణుకుతోంది.
అయితే ఈ మహమ్మారి కారణంగా అన్ని రంగాల పరిశ్రమలు మూతపడ్డాయి.దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు.
కాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన సినీ కార్మికులు కూడా ఎలాంటి పనులు లేకపోవడంతో ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా రోజూ వారి కూలీలుగా పనిచేసే వారు ఆకలి బాధలు పడకుండా చిత్ర పరిశ్రమకు చెందినవారు కరోనా కారణంగా వారికి తగు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
కరోనా క్రిసిస్ చారిటీ(CCC) పేరిట ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన విరాళాలు సేకరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో తనవంతు సాయంగా అక్కినేని హీరో నాగచైతన్య రూ.25 లక్షలు విరాళాన్ని అందించారు.
ఇలా స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు సైతం తమ ఇండస్ట్రీకి చెందిన కార్మికుల బాగోగులు చూసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం అని పలువురు అంటున్నారు.