అక్కినేని హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ దసరాకు విడుదలకు సిద్దం అయ్యింది.దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేందుకు గాను చిత్ర యూనిట్ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అఖిల్ సినిమా అనగానే జనాల్లో కాస్త ఆసక్తి మొదలు అవుతోంది.అయితే ఆయన గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఆయన సినిమా లు అంటే జనాలు కాస్త లైట్ తీసుకునేలా ఉన్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఎక్కడ ఏవిధమైన స్కోప్ ఉన్నా కూడా బ్యాచిలర్ ను ప్రమోట్ చేసేందుకు గాను ప్రయత్నిస్తున్నారు.
ఇంతగా ప్రమోట్ చేసినా కూడా ఇంకా బ్యాచిలర్ గురించి జనాల్లో నమ్మకం కలగడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాకు భారీగా ప్రమోషన్ చేస్తున్నా కూడా జనాలు మాత్రం హైప్ ను పెంచుకోవడం లేదు.
అయితే ఇది ఒకందుకు మంచిదే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే ఆయన హీరోగా నటించిన గత సినిమాలు భారీ హైప్ తో వచ్చాయి.అందులో ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా కూడా ప్లాప్ కిందే జమ కట్టేశారు.
అంచనాలు లేకుండా ఏదైనా సినిమా వస్తే అది యావరేజ్ గా ఉన్నా కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.అంటే ఆ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతాయి.కనుక బ్యాచిలర్ కూడా హైప్ క్రియేట్ చేయకుండా వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే కెరీర్ బెస్ట్ ను అఖిల్ దక్కించుకున్నట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాచిలర్ కు జోడీగా ఈ సినిమా లో పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు.