టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫ్యామిలీలలో అక్కినేని కుటుంబం ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో వారి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే అక్కినేని వారసులుగా నాగార్జున నాగచైతన్య అఖిల్ సుమంత్, సుశాంత్ వంటి హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే ఈ హీరోలు ఇద్దరు వారి కొత్త ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా సుశాంత్ అక్కినేని కుటుంబం సభ్యులందరూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోను షేర్ చేశారు.ఈ ఫోటోలో నాగార్జున దంపతులతో పాటు నాగార్జున సోదరుడు వెంకట్ దంపతులు అలాగే మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఉన్నారు.
ఇక అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం విదేశాలలో ఉండటం వల్ల ఆయన ఈ ఫోటోలో మిస్ అయ్యారు.ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ ఫొటోలో సమంత లేని లోటు స్పష్టంగా కనపడుతుందని ఆమె లేకపోవడం చాలా బాధగా ఉంది అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.అయితే సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత అక్కినేని కుటుంబానికి సమంత సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఉండేది.
ఇలా సమంత లేకుండా అక్కినేని ఫ్యామిలీ ఫోటో వైరల్ కావడంతో సమంత లేనిలోటు స్పష్టంగా కనబడుతుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.