బిగ్ బాస్ సీజన్ 4.స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ షోలో ఎంతోమంది సెలబ్రెటీలు వచ్చి ఆడుతున్నారు.పాడుతున్నారు.అందరిని మెప్పిస్తున్నారు.నిజానికి గత మూడు సీజన్ల కంటే కంటెస్టెంట్లు ఘోరంగా ఆడుతున్నారు.అయినా సరే ఏదో అదృష్టం చేసుకున్నారు.
అందుకే బిగ్ బాస్ హౌస్ కి వచ్చి స్టార్ డమ్ సొంతం చేసుకున్నా లేకున్నా.అక్కినేని కుటుంబం నుంచి మంచి వరాలు మాత్రం పొందుతున్నారు.
ఇందుకు నిదర్శనం.గంగవ్వ, కుమార్ సాయి, దివినే.
ఎందుకంటే.వాళ్లకు ఏది అయితే కావాలో అది అక్కినేని నాగార్జుననే ఇచ్చేస్తున్నాడు.నాగార్జున మాత్రమే అని అనుకుంటే ఇప్పుడు సమంత కూడా అంతే దివికి వరం ఇచ్చేసింది.మొదటికి వస్తే.గంగవ్వ.50 ఏళ్ల వయసులో యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టి తన యాసతో భాషతో తెలివితో ఎంతోమందికి నచ్చి బాగా ఫెమస్ అయ్యింది.అలాంటి గంగవ్వ ఇల్లు కట్టుకోవడం కోసం బిగ్ బాస్ షోకి వచ్చింది.కానీ ఆరోగ్యం బాగోలేక మధ్యలోనే బయటకు వచ్చింది.నేను ఇల్లు కట్టిస్తా గంగవ్వ అంటూ ఆమెకు వరం ఇచ్చాడు నాగార్జున.
ఇక కుమార్ సాయి.
తన గురించి ఏం అని చెప్తం.అయోమయంలో ఉన్నా ఎంతోమంది ప్రేమను సొంతం చేసుకున్నాడు కుమార్ సాయి.
షోలో అడుగుపెట్టేముందే నాగార్జున గారిని కథ చెప్పడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగాడు.అలా అడిగినట్టుగానే కుమార్ సాయి ని బయటకు పంపే సమయంలో నాకు కథ చెప్పుదువులే.
నచ్చితే సినిమా చేద్దాం అంటూ అవకాశం ఇచ్చేశాడు.నిజానికి గత సీజన్ లో ఇలా ఎవరికి చేయలేదు.
కానీ ఈ షోలో మాత్రం నాగార్జున అందరికి భలే అవకాశాలు ఇచ్చేస్తున్నాడు.
నాగార్జున మామయ్య అనుకుంటే కోడలు పిల్ల కూడా అలానే ఉంది.
దివి కి సినిమా అవకాశాలు రావాలనే బిగ్ బాస్ షో కి వచ్చింది.పెద్దగా ఆట ఆడకపోయినా తన అందంతో.ముక్కుసూటిగా మాట్లాడి అందరి మనసు దోచేసింది ఈ సొట్టబుగ్గల సుందరి.ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన దివికి కార్తికేయతో తనతో కలిసి నటించే అవకాశం ఇచ్చేసింది.
ఇలా అక్కినేని కుటుంబం బిగ్ బాస్ కంటస్టెంట్లకు వరాల మీద వరాలు ఇచ్చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు.