అక్కినేని అన్నదమ్ములు నాగ చైతన్య, అఖిల్ ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ లో దిగబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ వస్తుంది.
ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఫైనల్ గా ఆగష్టు 7న ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఇక మరోపక్క అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది.
ఆ సినిమాను కూడా ఆగష్టు ఫస్ట్ వీక్ రిలీజ్ చేయాలని చూస్తున్నారత.అలా చేస్తే అక్కినేని అన్నదమ్ములు ఇద్దరు బాక్సాఫీస్ ఫైట్ షురూ అయినట్టే.ఇన్నాళ్లు ఆగి ఒకరి సినిమాకు మరొకరు పోటీ ఎందుకని కాంప్రమైజ్ అయ్యి ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాశం ఉంది.లవ్ స్టోరీ సినిమాపై ఇప్పటికే ఆడియెన్స్ లో సూపర్ బజ్ ఏర్పడింది.
బ్యాచ్ లర్ సినిమాకు ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు.అఖిల్, పూజా హెగ్దే కలిసి నటించిన బ్యాచ్ లర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది.
ఈ సినిమాలో పూజా హెగ్దే అందాలు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.