ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి ప్రముఖుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.అయితే మొన్నటి మొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని అన్ని వర్గాల వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కొంతమందిని ఇందులో భాగస్వాములను చేస్తున్నారు.
అయితే తాజాగా అక్కినేని కోడలు, అక్కినేని నాగార్జున భార్య అయినటువంటి అమల మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఐఏఎస్ విసిరి నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు.ఇందులో భాగంగా గా ఈ రోజున తను నివాసం ఉంటున్న ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటారు.
అంతేగాక మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసనకి అమల గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ట్విట్టర్లో తన అధికారిక ఖాతా ద్వారా అక్కినేని అమల తెలిపారు.అలాగే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలనే మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి సంతోష్ కుమార్ కి అభినందనలు తెలిపారు.అంతేగాక అందరికీ వచ్చే నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెబుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ప్రముఖ ఫోక్ సింగర్ అయినటువంటి మంగ్లీ మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ని జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్, యాంకర్ శ్రీ ముఖి, జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ తదితరులకు విసిరారు.
.