యంగ్ హీరో శర్వానంద్ గత రెండు మూడు సంవత్సరాలుగా సక్సెస్లు లేక ఢీలా పడిపోయాడు.ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
ఇప్పటికే శ్రీకారం సినిమా పూర్తి అయ్యింది.ఇటీవలే ఒక ద్విభాష సినిమాను పూర్తి చేశాడు.
తెలుగుతో పాటు తమిళంలో ఒక సారి విడుదల కాబోతుంది.మరో వైపు మహా సముద్రం మరియు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలను కూడా చేయబోతున్నాడు.
ఈ నాలుగు సినిమాల్లో అతడు నటించిన ద్వి భాష సినిమా చాలా ప్రత్యేకంగా నిలువబోతుంది.అందుకు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అమ్మ కొడుకు సెంటిమెంట్ తో సినిమా సాగుతుందట.ఆ విషయంపై ఇప్పటికే యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది.
తాజాగా వచ్చిన మరో సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్వానంద్కు అమ్మ పాత్రలో సీనియర్ హీరోయిన్.అక్కినేని నాగార్జున భార్య అయిన అమల అక్కినేని కనిపించబోతుందట.ఇప్పటికే ఆమె షూటింగ్ పూర్తి చేసింది.లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అమల నటించారు.
మళ్లీ ఇన్నాళ్లకు ఆమె నటించింది.వచ్చే ఏడాది సమ్మర్కు విడుదల కాబోతున్న ఈ ద్విభాష సినిమాపై శర్వానంద్ చాలా ఆశలు అంచనాలు పెట్టుకున్నాడు.
అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.అమల గత సినిమా నిరాశ పర్చడం వల్ల ఈ సినిమా ఫలితం ఏంటీ అనే విషయంలో కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాని మేకర్స్ మాత్రం శర్వానంద్ మరియు అమల మద్య ఉండే సెంటిమెంట్ ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
త్వరలోనే సినిమా టైటిల్ను అధికారికంగా రివీల్ చేయబోతున్నారు.
.