అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు.ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం అవ్వడం లేదు.
వ్యక్తిగత జీవితం కూడా సాఫీగా సాగడం లేదు అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.ఇలాంటి సమయంలో అంతా మంచి జరిగేందుకు అఖిల్ అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు చరణ్ లు ఇప్పటికే చాలా సార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు.ఇరుముడి కట్టుకుని శబరిమల వెళ్లారు.టాలీవుడ్కు చెందిన ఇంకా చాలా మంది హీరోలు కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్నారు.ఇప్పుడు సీజన్ కాకున్నా కూడా షూటింగ్స్ లేకపోవడంతో అఖిల్ అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాల్లో సక్సెస్ రావడంతో పాటు అన్ని విషయాల్లో కూడా సంతోషం పొందడానికి అఖిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశ పర్చాయి.ప్రస్తుతం ఈయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.రికార్డు స్థాయిలో ఈ చిత్రంను గీతాఆర్ట్స్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రంతో అఖిల్ ఖచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.