అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం తన నాల్గవ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.అల్లు అరవింద్ నిర్మిస్తున్న అఖిల్ 4 చిత్రం వచ్చే ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న అఖిల్ 4 చిత్రం పూర్తి కాకుండానే మరో సినిమాకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి.అఖిల్ కెరీర్ ఆరంభించి దాదాపు అయిదు సంవత్సరాలు అయ్యింది.
కాని ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలను మాత్రమే విడుదల చేశాడు.
అఖిల్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు.వరుసగా ఫ్లాప్లు వస్తున్న కారణంగా ఆయన సినిమాలను చాలా స్పీడ్గా ఎంపిక చేసుకోవడంలో వెనుకంజ వేస్తున్నాడు.అయితే సక్సెస్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయాలని అఖిల్ నిర్ణయించుకున్నాడు.
తన నాల్గవ సినిమా విడుదల కాకుండానే అయిదవ సినిమాను మొదలు పెట్టాలని చకచక పనులు చేస్తున్నాడు.ఇప్పటికే తన అయిదవ దర్శకుడిని కూడా ఎంపిక చేసుకున్నాడు.
తమిళంలో పలు హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మిత్రన్తో అఖిల్ 5వ సినిమా ఉండబోతుంది.ఇటీవలే మిత్రన్తో భేటీ అయిన అఖిల్ స్క్రిప్ట్ చర్చలు జరిపాడు.త్వరలో నాగార్జునతో కూడా మిత్రన్ స్క్రిప్ట్ చర్చలు జరుపబోతున్నాడట.ఇప్పటికే అఖిల్ తన నాలుగు సినిమాలకు ఇద్దరు తమిళ దర్శకులతో పని చేశాడు.ఇప్పుడు మరోసారి మిత్రన్ అనే తమిళ దర్శకుడితో పని చేయబోతున్నాడు.తన అయిదుగురు దర్శకుల్లో ముగ్గురు తమిళ వారే అవ్వడంతో సోషల్ మీడియాలో అఖిల్పై కామెంట్స్ వస్తున్నాయి.
తమిళ వాళ్లపై ఉన్న నమ్మకం తెలుగు వారిపై లేదా అంటూ అఖిల్ను విమర్శిస్తున్నారు.బొమ్మరిల్లు భాస్కర్ మరియు విక్రమ్ కె కుమార్లు ఇద్దరు కూడా తమిళ దర్శకులే.
మిత్రన్ కూడా తమిళ దర్శకుడే.