నాగార్జున నట వారుసుడు అఖిల్ అక్కినేని ఫస్ట్ హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు.అతను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగేళ్ళు అవుతున్న, ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన హిట్ మొహం చూడలేదు.
కమర్షియల్ హీరోగా ఎదగాలనే అతని ప్రయత్నంలో విఫలం లేకపోయినా కూడా కంటెంట్ విషయంలో తేడా కొడుతూ ఉండటంతో హిట్ రావడం లేదు.అయితే ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది.ఈ సినిమా మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం ప్రకటించడానికి రెడీ అయ్యాడు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తుండగా, సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ సినిమాకు సంబందించిన అధికార ప్రకటన రాబోతుంది.సురేందర్ రెడ్డి స్టైల్ లో సాగే మాస్, కమర్షియల్ చిత్రంగానే ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఇందులో జేమ్స్ బాండ్ తరహాలో గూఢచారి పాత్రలో అఖిల్ కనిపించనున్నట్టు టాక్.స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం.
సైరాతో జోరు మీద ఉన్న సురేందర్ రెడ్డి ఈ సినిమాని అఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.
.