రాజకీయాలలో మొదటి నుంచి స్వామీజీలు, జ్యోతీష్యుల హవా ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా రాజకీయ నాయకులు కొంత మంది స్వామీజీలని, జ్యోతీష్యులని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు.
వారు చెప్పిన మాటలు తూచా తప్పకుండా ఫాలో అవుతారు.కొంత మంది రాజకీయ నేతలితే స్వామీజీలని దైవాంశ సంభూతులుగా భావిస్తారు.
ఏపీలో కూడా ముఖ్యమంత్రి జగన్ స్వరూపానందని భాగా ఎక్కువగా నమ్ముతారు.ఈ నేపధ్యంలో తరుచుగా జగన్ అతనిని కలవడం జరుగుతుంది.
జగన్ దారిలోనే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వరూపానందని కలుస్తూ అతని ఆశీర్వాదం తీసుకుంటారు.ఇప్పుడు యూపీ విషయంలో కూడా ఇంచు మించు అదే పరిస్థితిలో కనిపిస్తుంది.
అక్కడ మాజీ సిఎం సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన భవిష్యత్తు కోసం ఓ జ్యోతీష్యుడుని నమ్ముకున్నాడు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికరంగా మారింది.2022లో యూపీలో జరగబోయే ఎన్నికలలో తాము ఏకంగా 350 సీట్లు సొంతం చేసుకొని అధికారంలోకి వస్తామని, ఈ విషయాన్ని తనకి ఒక జ్యోతీష్యుడు చెప్పాడని ఆసక్తికర వాఖ్యలు చేశారు.విమానంలో ఢిల్లీకి వెళ్ళినపుడు ఒక జ్యోతీష్యుడు తన చెయ్యి చూసాడని, గట్తిగా కష్టపడితే రాబోయే ఎన్నికలలో మీరు 350 సీట్లు తెచ్చుకోవడం గ్యారెంటీ అని చెప్పారని అన్నారు.
అతని మాటలపై తమకి విశ్వాసం ఉందని, ఆ జ్యోతీష్యుడు చెప్పినట్లు కస్టపడి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, బీజేపీలా అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పి 2022 అసెంబ్లీ ఎన్నికలలో 350 సీట్లు తెచ్చుకుంటామని తెలిపారు.అయితే ఇప్పుడు అఖిలేష్ అన్న మాటలు రాజాకీయాలలో ఆసక్తికరంగా చర్చించుకుంటే ఇతర పార్టీల వారు విమర్శలు చేస్తున్నారు.
నెటిజన్లు ఆసక్తికరంగా ట్రోల్ చేస్తున్నారు.