ఒక వైపు తెలుగు దేశం పార్టీ అమరావతి రైతులతో కలిసి గత మూడు వారాలుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకులు అంతా కూడా ఒకేమాటపై ఉండాలి.కాని తాజాగా మాజీ మంత్రి భూమ అఖిలప్రియ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీ నాయకులను ఇరుకున పెట్టేవిధంగా ఉన్నాయి.
ఇటీవల ఒక కార్యక్రమంలో అఖిలప్రియ మాట్లాడుతూ ఏపీకి రాజధాని అనేది అమరావతి లేదంటే కర్నూలు అయ్యి ఉండాలి.మూడు రాజధానులు అక్కర్లేదు అన్నాడు.అమరావతి రైతులకు రాయలసీమ రైతులు మద్దతుగా నిలుస్తారని, తప్పకుండా వారికి కష్టం వస్తే సాయంగా నిలుస్తారంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అభివృద్ది పూర్తిగా ఆగిపోయిందని, ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత నిర్ణయాలు అభివృద్దికి అడ్డుగా ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.