అక్కినేని ఫ్యాన్స్ ఆశాజ్యోతి అఖిల్.ఈయన టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో నిలుస్తాడని ఫ్యాన్స్ చాలా బలంగా నమ్మారు.
కాని పరిస్థితి చూస్తుంటే సాదా సీదా హీరోగానే అఖిల్ మిగిలి పోతాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు నిరాశ పర్చాయి.
ప్రస్తుతం చేస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు పతాక స్థాయిలో ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంను ఆయన రూపొందిస్తున్నాను అంటున్నాడు.ఇదే సమయంలో అక్కినేని అఖిల్ హిందీలో ఒక వెబ్ సిరీస్ కు ఓకే చెప్తాడా అంటూ టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం ఇండియాలో ఓటీటీ కంటెంట్ విషయంలో పెద్ద ఎత్తున ప్లాన్స్ చేస్తున్నారు.
స్టార్ హీరోలు మరియు దర్శకులు కూడా ఓటీటీ కంటెంట్ కోసం ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు.ఇలాంటి సమయంలో అఖిల్ను ఒక హిందీ వెబ్ సిరీస్ దర్శకుడు సంప్రదించాడట.
లీడ్ రోల్ కోసం అఖిల్ ను సంప్రదించడంతో పాటు కథ కూడా చెప్పాడట.సౌత్ లో ముఖ్యంగా తెలుగులో ఆ వెబ్ సిరీస్ ఆడాలంటే అఖిల్ ఉండాలని ఆ దర్శకుడి ఆలోచన.
పారితోషికం భారీగా ఆఫర్ చేయడంతో పాటు కథలో కీలక పాత్ర అవ్వడంతో అఖిల్ ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నాడు అంటున్నారు.అయితే ఇప్పుడే ఓటీటీకి ఓకే చెప్తే సినిమా కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అఖిల్ నిర్ణయం ఆయన కెరీర్ పై ప్రభావంను చూపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి అఖిల్ తీసుకోబోతున్న నిర్ణయం ఏంటీ అనేది చూడాలి.