అఖిల్ అక్కినేని – అఖిల్ – ది పవర్ ఆఫ్ జువా గత నెల 22న విడుదల కావల్సిదన్న సంగతి తెలిసిందే.గ్రాఫిక్స్ వర్క్ సరిగా లేకపోవడంతో చిత్రాన్ని వాయిదా వేసారు.
అయితే ఇలా వాయిదా వేయడం అఖిల్ కు నచ్చలేదని.ఈ విషయమై నాగార్జునతో గొడవపడి అఖిల్ అలిగాడని వార్తలు వచ్చాయి.
పలు పత్రికలు, సినిమా వెబ్ సైట్లు దీని మీద కథనాలు కుడా ప్రచురించాయి.అఖిల్ ఈ గాలి వార్తలను కొట్టిపడేసాడు.
అలాంటిదేమీ జరగలేదని, కేవలం గ్రాఫిక్స్ వలనే సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది.బాహుబలి కూడా అదే కారణంతో వాయిదా వేసారు కదా అని సమాధానమిచ్చాడు.
“నాన్నగారికి నాకు గొడవ అయ్యిందని, నేను అలిగాను అని చాలా మంది ఆర్టికల్స్ రాసారు.అలాంటి ఆర్టికల్స్ నేనూ చదివాను.
నేను మా నాన్నగారితో గొడవ ఎందుకు పడతాను.ఏది పడితే అది రాసేసారు.
గ్రాఫిక్స్ చూసి మేం కంగారు పడ్డాం.అలాంటి సమయంలో నాన్నగారు చాలా కూల్ గా, తన అనుభవాన్నిను ఉపయోగించి మమ్మల్ని నడిపించారు.అందుకు ఆయనకు థాంక్స్ చెప్పుకోవాలి మా యూనిట్ మొత్తం.” అని వివరణ ఇచ్చాడు అఖిల్.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న అఖిల్ ఈ నెల 11న విడుదల అవుతోంది.