టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే హిట్ను అందుకోవాలని అఖిల్ భావిస్తున్నాడు.
గతంలో బొమ్మరిల్లు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ అందించిన దర్శకుడు భాస్కర్, ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడు.స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు అఖిల్ రెడీ అయ్యాడు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను చిత్ర యూనిట్ ఇప్పటికే పూర్తి చేశారు.ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్ను జనవరి నెలలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయాలని, ఆ తరువాతే సురేందర్ రెడ్డితో తన నెక్ట్స్ చిత్రాన్ని ప్రారంభించాలని అఖిల్ ఆలోచిస్తున్నాడు.
సంక్రాంతి తరువాత ఈ సినిమాను ప్రారంభిస్తే వేసవి కానుకగా ఈ సినిమాను రెడీ చేయొచ్చని అఖిల్ అండ్ టీమ్ భావిస్తోంది.ఇక ఈ సినిమాను పూర్తి యూత్ఫుల్ చిత్రంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాతో అఖిల్కు అదిరిపోయే హిట్ ఇవ్వాలని సురేందర్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ రష్మిక మందనను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి ఈ సినిమాను సంక్రాంతి తరువాత మొదలుపెడతారా లేక అంతకు ముందే ప్రారంభిస్తారా అనేది చూడాలి.