చిన్న వయస్సులోనే సిసింద్రీ అనే సినిమాలో నటించి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు అఖిల్.ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైంది.
అయితే పెద్దయ్యాక అఖిల్ హీరోగా నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తుండగా ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.సైరా సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సురేందర్ రెడ్డి అఖిల్ కు జోడీగా రష్మిక మందన్నాను ఫైనల్ చేసినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి.
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు సురేందర్ రెడ్డి ఒక కొత్త అమ్మాయిని ఫైనలైజ్ చేశారని సమాచారం.ముంబై మోడల్ వైద్యా సాక్షి ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది.
అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.హైదరాబాద్ కు వైద్యా సాక్షిని పిలిపించి అడిషన్ నిర్వహించి సురేందర్ రెడ్డి ఈమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.వైద్యా సాక్షి సహజ నటి అని, సినిమాలోని పాత్రకు సాక్షి ప్రాధాన్యాన్ని తీసుకొస్తుందని సురేందర్ రెడ్డి నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు.
హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటున్న టాలీవుడ్ కు వైద్యా సాక్షి రూపంలో మరో కొత్త హీరోయిన్ దొరికినట్టేనని చెప్పవచ్చు.వైద్యా సాక్షి పలు యాడ్ ఫిలిమ్స్ లో కూడా నటించారని సమాచారం.
ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కావాల్సి ఉంది.ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.